న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్పై ప్రభావంతంగా పని చేస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకాను ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారు చేసింది.
కొవాగ్జిన్ రోగ లక్షణాలున్న వ్యక్తుల్లో 77.8శాతం ప్రభావం చూపగా.. కొత్త డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా 65.2శాతం రక్షణ కల్పించిందని భారత్ బయోటెక్ జూలైలో తెలిపింది. తీవ్రమైన కేసులపై వ్యాక్సిన్ 93.4శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ వివరించింది. కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్లో సెకండ్ వేవ్కు ఈ వేరియంట్ కారణమని తేలగా.. ప్రస్తుతం 132 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా, జపాన్, సింగపూర్ సహా పలు దేశాలను వణికిస్తున్నది.