మలక్పేట, జూన్ 16: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురికి న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న తెలిపారు.
హయత్నగర్కు చెందిన డీసీఎం డ్రైవర్ ఆళ్ల ఆదినారాయణరెడ్డికి రూ. 2100 జరిమానా, ఏడు రోజుల సాధారణ జైలు, మూసారాంబాగ్కు చెందిన బోనాలు వెంకటేశ్కు రూ. 2100 ఫైన్, మూడురోజుల సాధారణ జైలు, కొత్తపేట మారుతీనగర్కు చెందిన బింగి రవితేజగౌడ్కు రూ. 2100తో పాటు పదిరోజుల సాధారణ జైలు శిక్ష, సైదాబాద్కు చెందిన వీరవెంకటేశ్కు రూ.2100 జరిమానా, ఆరు రోజుల జైలు, దిల్సుఖ్నగర్కు చెందిన పత్తెపు విశాల్కు రూ.2100 ఫైన్, ఐదురోజుల జైలు, అంబర్పేట అలీకేఫ్ ప్రాంతానికి చెందిన బి.వేణుకు రూ.2100 జరిమానా, ఏడురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జ్యోత్స్న తెలిపారు.