న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని నజఫ్గర్హ్ ఏరియాలో దారుణం జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేక ఓ 75 ఏండ్ల వృద్ధురాలిని దంపతులు అత్యంత దారుణంగా హత్య చేశారు. అనిల్ ఆర్య, తను అనే దంపతులు.. 75 ఏండ్ల వృద్ధురాలి నుంచి రూ. లక్ష అప్పు తీసుకున్నారు. తన డబ్బు తనకు తిరిగివ్వాలని ఆమె ఆ దంపతులను డిమాండ్ చేసింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో అనిల్ ఉన్నాడు. ఈ క్రమంలో వృద్ధురాలిని గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి స్థానికంగా ఉన్న కెనాల్లో పడేశారు. అయితే ఈ విషయం పోలీసుల దాకా చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కెనాల్లో పడేసిన వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. ఇద్దరు దంపతులను పోలీసులు జైలుకు పంపారు.