రంగారెడ్డి : జిల్లాలోని జూపాల శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందారు. మృతులను మంచాల మండలం బోడకొండ తండాకు చెందిన దంపతులు లక్ష్మణ్, మంగగా గుర్తించారు. పండుగ వేళ దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.