అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగర్లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నల్గొండ జిల్లా అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన హాజీబాబా, మాదవిలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం సొంత గ్రామంలో వివాహం చేసుకుని శాంతినగర్లో నివాసముంటున్నారు. హాజీబాబాతో పెళ్లికి మాధవి కుటుంబసభ్యులు నిరాకరించడంతో సొంత గ్రామాన్ని వదలి శాంతినగర్కు మకాం మార్చి అక్కడే ఉంటున్నారు .
కాగా తమ కుమార్తె కనిపించడం లేదంటూ మాధవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 15న అడవి దేవరపల్లి పోలీసులు దంపతులను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. ఇంటికి వచ్చిన దంపతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని గమనించి చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. అడవిదేవరపల్లి పోలీసులు తమను వేధింపులకు గురిచేరని ఆరోపిస్తూ దంపతులు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.