నల్లగొండ: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్ స్వయంగా ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు.