హైదరాబాద్: దేశంలో లీగ్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఐపీఎల్, పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్), ఐఎస్ఎల్(ఇండియన్ సూపర్ లీగ్) అభిమానులను అలరిస్తుంటే తాజాగా ఈ జాబితాలో మరో గ్రామీణ క్రీడ ఖో-ఖో చేరింది. అల్టిమేట్ ఖో-ఖో లీగ్(యుకేకే)త్వరలో మన ముందుకు రాబోతున్నది. అత్యుత్తమ హంగులతో ఆకట్టుకోబోతున్న ఖో-ఖో లీగ్లో ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు జీఎంఆర్, అదానీ గ్రూప్స్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. తెలుగు జట్టును జీఎంఆర్, గుజరాత్ టీమ్ను అదానీ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. దక్షిణా భారత్లో ఖో-ఖో క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని లీగ్లో భాగమవుతున్నట్లు జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్కుమార్ పేర్కొన్నారు.