న్యూఢిల్లీ, జూలై 12: కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటున్నదని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొవిడ్-19 టాస్క్ఫోర్స్ కోచైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ హెచ్చరించారు. అధికారులు, ప్రజలు కలసికట్టుగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. కాగా, మంగళవారం రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 13,615 కేసులు నమోదయ్యాయి. 20 మంది మరణించారు. ఒక్కరోజులోనే కేసుల్లో 3.23 శాతం పెరుగుదల కనిపించింది.