ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఇక్కడి స్థానిక ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
అయితే ఆ తర్వాత కరోనా కేసులు పెరిగిపోయాయి. అదే సమయంలో ఆస్పత్రిలో కొత్త మార్చురీ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాత మార్చురీ గురించి అధికారులు మర్చిపోయారు. ఇప్పుడు కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టడంతో.. పాత రికార్డులు తిరగేసిన అధికారులకు ఈ విషయం తట్టింది. పాత మార్చురీకి వెళ్లి మృతుల మృతదేహాలను బయటకు తీశారట.