రోజుకు 50 వేల కేసులు.. వెలుగులోకి కొత్త స్ట్రెయిన్
లండన్, అక్టోబర్ 19: బ్రిటన్లో మళ్లీ కరోనా పడగ విప్పుతున్నది. సోమవారం ఒక్కరోజునే 49,156 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 45-50 వేల కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడికి ‘ప్లాన్ బీ’ అమలుకు యోచిస్తున్నారు. ముఖానికి మాస్కులు, భౌతిక దూరం, బూస్టర్ డోసు తీసుకోవడం, వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉన్నవారినే దేశంలోకి అనుమతించడం వంటివి ‘ప్లాన్ బీ’లోని ప్రధానాంశాలు. మరోవైపు, డెల్టా వేరియంట్కు చెందిన కొత్త ఉత్పరివర్తనం ‘ఏవై.4.2’ స్ట్రెయిన్ను తాజాగా గుర్తించినట్టు బ్రిటన్ అధికారులు తెలిపారు. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి, తీవ్రతను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.