అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తున్నది. నిత్యం కేసుల సంఖ్య వందల్లో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడి 842 మంది కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,07,676కు చేరింది. 8 లక్షల 90 వేల మందికిపైగా కోలుకున్నారు.
మరో 10,300 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు 7,239 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 31,072 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి