రాజన్నసిరిసిల్ల : వడదెబ్బతో ఓ నిరుపేద కూలీ మరణించాడు. జిల్లాలోని కోనరావుపేటలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సూరంపేట నారాయణ (50) భార్య లక్ష్మితో కలిసి సోమవారం ఉదయం గ్రామ శివారులోని కొండగుట్టకు చీపుర్లు తయారు చేసే కాశ పుల్లల కోసం వెళ్లాడు.
మధ్యాహ్నం ఎండలో ఇంటికి తిరుగు పయనమయ్యారు.సేదతీరేందుకు మార్గంమధ్యలోని ఓ చెట్టుకింద ఆగారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు. ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం సిరిసిల్ల ఏరియా దవాఖనకు తరలించారు. నారాయణకు భార్యతో పాటు కూతుర్లు రజిత, మల్లవ్వ ఉన్నారు.