కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో యవతలో ఆ దిశగా చైతన్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూల్ డ్రింక్లకు అలవాటు పడిన వారు, క్రమంగా వారి అలవాట్లను మార్చుకుంటున్నారు. కరోనా వస్తే దగ్గు, జలుపు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి అనేక లక్షణాలు కనబడుతున్నాయి. అయితే, ఇమ్యూనిటీ ఉంటే కరోనా వల్ల ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారి నుంచి రక్షించపబడాలంటే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులకు కారణాలుగా ఉండే కూల్ డ్రింక్స్ (శీతలపానియాలు)ను తాగడాన్ని తగ్గించారు. వైరస్కు భయపడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కూల్డ్రింక్స్కు ప్రత్యామ్నాయంగా ఓఆర్ఎస్ (ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్) డ్రింకులను తాగడానికి యువత ఇష్టపడుతున్నారు. ఇవి యాపిల్, ఆరెంజ్ ఫ్లేవర్లో అన్ని మెడికల్, కిరాణా, బేకరీ, మిల్క్ పాయింట్తో పాటు పాన్షాపులలో లభిస్తున్నాయి. కూల్డ్రింక్స్ ధరలకే ఓఆర్ఎస్లు అందుబాటులోకి వచ్చాయి. పైగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లూహెచ్వో) నిర్ణయించిన ఫార్ములా ప్రకారం, కొన్ని మందుల కంపెనీలు ఓఆర్ఎస్ డ్రింకులను మార్కెట్లోకి విడుదల చేశాయి. దీనికి తోడుగా కొన్ని ఫార్మా కంపెనీలు ఎనర్జీ (శక్తినిచ్చే) డ్రింకులను కూడా మార్కెట్లో విడుదల చేశాయి.
గతంలో బేకరీలు, కిరాణా షాపులు, పాన్షాపులలో అందుబాటులో ఉండే కూల్డ్రింకులను తాగేవారము. ఇప్పుడు యాపిల్, ఆరెంజ్ ఫ్లేవర్ అందుబాటులో ఉండే ఓఆర్ఎస్ డ్రింకులను తాగుతున్నాం. పైగా కూల్డ్రింక్స్ ధరలకే ఎనర్జీ డ్రింకులు మార్కెట్లో లభిస్తున్నాయి. పైగా ఓఆర్ఎస్, ఎనర్జీలు డ్రింకులను యువకులు మాత్రమే కాకుండా చిన్న పిల్లలతో మొదలు అన్ని వయసుల వారు తీసుకోవడం వల్ల వారికి శరీరంలో శక్తి వస్తుందంటున్నారు. – పవన్, యువకుడు
కరోనా నేపథ్యంలో కూల్డ్రింకులను తాగే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గుతుంది. దానికి బదులుగా ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింకులను తాగుతున్నరు. పైగా కూల్డ్రింకుల ధరలకే టెట్రా ప్యాక్లో అందుబాటులో ఉండే ఈ డ్రింకుల వల్ల శక్తి వస్తుంది. పైగా వరల్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్ణయించిన డ్రింకు కావడం, ఇంకా దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవని ఫార్మా కంపెనీలు చెబుతుండటంతో చాలా మంది ఇవే తాగుతున్నరు. – లక్ష్మీనారాయణ, కిరాణా షాపు యజమాని