హైదరాబాద్: ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 66,290 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సీఎస్ఈ-16,801సీట్లు, ఈసీఈ-12, 582 సీట్లు, ట్రిపుల్ ఈ 6,336 సీట్లు, సీఎస్ఈ-ఏఐ, ఎంఎల్లో 5,037, డెటా సైన్సులో 3,003 సీట్లు, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 1638, ఐఓటీలో 1029 సీట్లు, సివిల్లో5,766 సీట్లు, మెకానికల్లో 5,355 సీట్లు కేటాయించారు. బీఫార్మసీలో ఎంపీసీ అభ్యర్థులకు 3,220 కన్వీనర్ కోటా సీట్లు, ఫార్మ్ డీలో ఎంపీసీ అభ్యర్థులకు 520 సీట్లు నింపనున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో అన్ని కోర్సుల్లో అదనంగా 10 శాతం సీట్లు పెంచనున్నారు.