అమరావతి,జూన్ 13:బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారుకొందరు. పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లుతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై మహాలక్ష్మి డిజిపికి ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారి మఠంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారిని పీఠాధిపతుల బృందం దర్శించుకున్నది. అనంతరం ప్రొద్దుటూరుకు బయల్దేరి వాసవీ కన్యకా పరమేశ్వర దర్శనం అనంతరం తిరిగి మఠానికి రానున్నారు. మఠానికి చేరుకున్న అనంతరం పీఠాధిపతి వారసులతో కలసి సమావేశం కానున్నది పీఠాధిపతుల బృందం.