మహబూబ్నగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,97,372 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడుమ కాలువలతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1,42,177 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుకున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 215.8070 టీఎంసీలు. ఇప్పుడు 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.