పెద్దపల్లి : తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. గ్రామంలోని స్వయంభూ శివలింగం వద్ద నిర్మించనున్న దేవాలయ ప్రతిపాదిత స్థలాన్ని శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ పూజలు చేశారు.
అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నతి పదవి చేపట్టిన తర్వాత సొంతూరికి వచ్చిన తనకు ఆత్మీయ స్వాగతం లభించడం ఆనందంగా ఉన్నదన్నారు. స్నేహితుల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జోడేఘాట్ను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్లు
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..