నల్లగొండ : యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేలా ఏర్పాట్లు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెం వద్ద సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ను ఆయన మంగళవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి సందర్శించారు.
అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన బీహెచ్ఈఎల్ అధికారులతో పాటు ట్రాన్స్కో, జెన్కో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. పనుల్లో జాప్యం జరుగకుండా ఉండేందుకు గాను కార్మికుల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు గాను చేపట్టాల్సిన చర్యలపై మంత్రి దిశా నిర్దేశం చేశారు.
కొవిడ్ నేపధ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ప్రాంగణంలోనే 20 పడకల ప్రత్యేక దవాఖాన నిర్మించాలని నిర్ణయించారు. దానిని10 రోజుల్లో పూర్తి చేయడం తో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తద్వారా కార్మికుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడం తో పాటు సిబ్బంది కి వైద్య సదుపాయం అందుబాటులో ఉంచగలుగుతామన్నారు.
సమావేశంలో బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానంద్, టీ ఆర్ కే రావు, కోల్ సీఎండీ జె యస్ రావు, ఎస్ఈ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు