అమరావతి : దేశ చట్టాలను తయారు చేసే వ్యక్తులే చట్ట సభల్లో వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో ఇవాళ జరిగిన ఆత్మీయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. కొంతమంది చేస్తున్న పనుల వల్ల చట్ట సభల స్థాయి తగ్గిపోతుందని, దీనిపై చర్చ జరగాలని, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. చట్టసభల్లో దుర్భాషలాడటం ఒక ట్రెండ్గా మార్చేశారని అన్నారు.
మహాత్మగాంధీ నాయకత్వంలో స్వతంత్రం కోసం ఉద్యమించిన వారి పేర్లతో నూతన నిర్మాణాలు చేయాలని కుటుంబ పాలకుల పేర్లు కాదని పేర్కొన్నారు. మనం మాట్లాడే భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృ భాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు ఎ దిగారని గుర్తు చేశారు. తనకు రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్య పని చేయడమే ఇష్టమని స్పష్టం చేశారు.