అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆది వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,020 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,418 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 100.355 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, 1632.87 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు పెరిగిన వరద..
కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పెరిగింది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 26,330 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 25,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10 అడుగుల మేర నీటి మట్టం ఉన్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.