ఛండీగఢ్: రైతు నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద గతవారం జరిగిన ఓ దళిత సిక్కు దారుణ హత్య వెనుక కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా ఆరోపించారు. హత్యకు పాల్పడిన నిందితుడికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన నిహంగ్ నాయకుడు ఒకరు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసి ఉన్న ఫొటోలు బయటకు రావడంపై ఆయన స్పందించారు.