హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఏ రాజకీయ పార్టీ అయినా విజయమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గట్టి పోటీ ఇచ్చేందుకు శ్రమిస్తుంది. మా వల్ల కాదని ముందే కాడి కింద పడేయదు. గౌరవప్రదమైన ఓటమి అంటూ కార్యకర్తలను నైరాశ్యంలోకి నెట్టదు. కానీ, రేవంత్రెడ్డి సారథ్యంలోని టీపీసీసీ మాత్రం పార్టీ క్యాడర్లో ఇలాంటి వాతావరణాన్నే సృష్టిస్తున్నది. డిపాజిట్ దక్కితే చాలన్న విధంగా వ్యవహరిస్తున్నది. ‘హుజారాబాద్ ఎన్నికల్లో గెలువం. రెండోస్థానంలో నిలిచే అవకాశం లేదు. గౌరవప్రదమైన ఓటమి కోసం ప్రయత్నిద్దా’మని టీపీసీసీ నియిం చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
బీజేపీ కోసమే..
హుజూరాబాద్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫు న పోటీ చేసి, 60 వేల ఓట్లు సాధించిన కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో చేరకముందు కూడా రేవంత్రెడ్డి ఇలాంటి మాటలతోనే నిరుత్సాహపరిచారు. బీజేపీ అభ్యర్థికి అనుకూలించేవిధం గా బలహీన అభ్యర్థిని బరిలోకి దిం పారనే విశ్లేషణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లకపోతే బా గుండదనే ఉద్దేశంతోనే సోమవారం నుంచి పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ పర్యటన పెట్టుకున్న ట్టు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఆయన సమాచారం ప్రకా రం హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న టార్గెట్ గౌరవప్రదమైన ఓటమి! గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు డిపాజిట్ దక్కితే చాలన్న దుస్థితికి చేరింది.