మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 50 దళిత కుటుంబాలు.. సంస్థాన్నారాయణపురం మండంలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాలు ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబావితండాకు చెందిన బీజేపీ వార్డు సభ్యుడు సారనాయక్, వివిధ పార్టీలకు చెందిన 50మంది కార్యకర్తలు ఎంపీపీ గుత్తా ఉమాదేవి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. మర్రిగూడ మండలంలోని అజిలాపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి టీఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్/సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని నేలపట్ల గ్రామంలో 10మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. పార్టీలో చేరినవారిలో బోడపట్ల బాలరాజు, బాలకృష్ణ, సత్తయ్య, డోకె వెంకటేశం, చిన్నం బీరుమల్లయ్య, శివశంకర్, నానంచర్ల ఆంజనేయులు, చేవెల్ల బాలరాజు, గుడుగుంట్ల నవీన్, నరేశ్ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, గ్రామ సర్పంచ్ చౌట వేణుగోపాల్గౌడ్, కప్పల శ్రీనివాస్గౌడ్, చిన్నం బాలరాజు, పబ్బతి ఆంజనేయులుగౌడ్, పబ్బతి వెంకటేశ్గౌడ్, గంగాపురం నగేశ్గౌడ్, బాలగోని భాస్కర్గౌడ్, బూడిద లింగస్వామి, చిన్నం స్వామి, దబ్బటి ఉపేందర్, మద్దోజు నర్సింహాచారి, గంగాపురం పాండు, కత్తుల సాయి, పాలమాకుల చందు, దబ్బటి భూషన్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12కుటుంబాల వారు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మ య్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గాలయ్య, లింగారెడ్డి, పాపయ్య, హరికృష్ణ, సురేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
చౌటుప్పల్ : మండలంలోని దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన 50 దళిత కుటుంబాల కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిరికంటి నిరంజన్గౌడ్, నాయకులు నర్సింహ, లింగస్వామి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.