మునుగోడు/మర్రిగూడ/చౌటుప్పల్ రూరల్/చండూరు, సెప్టెంబర్ 18 : మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడెం శాంతమ్మతోపాటు ఇద్దరు వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్, ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పలువురు నాయకులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 30మంది కార్యకర్తలు.. మునుగోడు మండల కేంద్రంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడితోపాటు 150 మంది కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి కులస్తులు.. చండూరు మండలం బోడంగిపర్తిలో వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
మర్రిగూడ, సెప్టెంబర్ 18 : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు వలసల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లె సీమలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. మండలంలోని యరగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ, వార్డు సభ్యులు పుప్పాల యాదగిరి, బందెల్లి రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ పులిమామిడి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నక్కనగోని కొండల్ సహా పలు పార్టీల నాయకులు ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. మతతత్వ పార్టీ, పదవి తాకట్టు పెట్టి బీజేపీకి అమ్ముడుబోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని రూ.22వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముకుని ప్రజల కోసమే రాజీనామా చేశానంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్న రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బాలం నర్పింహ, కొండూరు సర్పంచ్ కుంభం నర్సమ్మామాధరెడ్డి, దళిత బంధు జిల్లా మెంబర్ ఎల్.నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు చెర్కు లింగంగౌడ్, నున్నగోపుల గిరి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
చౌటుప్పల్ రూరల్ : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెం గ్రామ వివిధ పార్టీలకు చెందిన 30మంది కార్యకర్తలు ఆదివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
అంతకుముందు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హులకు పథకాలు అందనిచో కార్యకర్తలు వారికి దగ్గరుండి అందేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ పేద ప్రజల సంక్షేమ కోసం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల సింహాద్రి, నాయకులు సామిడి బుచ్చిరెడ్డి, బాల్రెడ్డి, మారేశ్గౌడ్, లింగయ్య, రాంచందర్, లింగస్వామి, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ వైపే.. ప్రజల చూపు
చండూరు : టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజల చూపు ఉందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని బోడంగిపర్తి గ్రామ వివిధ పార్టీలకు చెందిన 30కుటుంబాలు ఆదివారం ఆయన సంక్షమంలో టీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి మునుగోడు అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఊదరి వెంకన్న, ఎండీ.అఫ్జల్, గాలి జగన్, కొండ నర్సింహ, ఎండీ.నజీర్, సాగర్ల నర్సింహ, రహీం, అసిఫ్, నవీద్, యాదగిరి ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, కట్కూరి సత్తయ్య, నరేశ్, వరికుప్పల సురేశ్, బొమ్మరగోని రామలింగం, పి.భిక్షం, సరికొండ ముత్యాలు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి వలసలు
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
మునుగోడు, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన సమక్షంలో మునుగోడు పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిర్యాల మధుకర్తో పాటు సుమారు 150మంది కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి కులస్తులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, ఈద నిర్మల, పట్టణాధ్యక్షుడు రావిరాల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, నాయకులు బొడ్డు నాగరాజుగౌడ్, శరత్బాబు, అలువాల వెంకన్న, పాలకూరి అశోక్, నాగరాజు, శ్రీనివాసచారి పాల్గొన్నారు.