మహబూబ్నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన గత ముఖ్యమంత్రులు జేబులు నింపుకొన్నారే తప్పా ప్రజల బాగోగు లు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను తీసేయాలని ప్రధాని మోదీ చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.