డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ పార్థసారధిని మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వీరిరువురూ గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్, రిజిస్టార్గా విధులు నిర్వహించిన వారే కావడం గమనార్హం.