మంచిర్యాల : అసైన్డ్ భూములను పలువురి పేర్లపై అక్రమంగా పట్టా చేసిన కేసులో కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే నరేశ్ గౌడ్ పలువురి వ్యక్తుల నుండి రూ. వెయ్యి, రూ. 2 వేలు తీసుకుని అసైన్డ్ భూములను అక్రమంగా పట్టా చేస్తున్నట్లు ఆరోపణలు. రామగుండం సీపీ వి. సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెన్నెల తహసీల్దార్ జడి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నరేశ్ గౌడ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇతనితో పాటు మరో పదిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదైనట్లు చెప్పారు. 2012 నుండి ఇప్పటివరకు మొత్తం 88 మంది రైతులకు అసైన్డ్ భూములను పట్టా చేసినట్లుగా విచారణలో నరేశ్ తెలిపాడన్నారు. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులకు 207 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా చేసినట్లు వెల్లడించారు.