అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని , వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీకి చెందిన ఏపీ నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్కు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో ఎస్సీ యువకుడు ఆత్మహత్యను గవర్నర్కు వివరించారు. జగన్ పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.