ముంబై: అక్కడ రూ.55కే ఐదు జతల బట్టలు ఉతుకుతారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మురికివాడల ప్రజల కోసం ఖురేషి నగర్లోని సువిధా సెంటర్లో కమ్యూనిటీ వాషింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 5 జతల బట్టలు ఉతకడానికి రూ.55 మాత్రమే వసూలు చేస్తున్నారు. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవారు, నీరు కొనడానికి స్థోమత లేని ప్రజల కోసం ఈ ఏడాది ప్రథ సామాజిక ఎన్జీవో సంస్థ దీనిని ప్రారంభించిందని మేనేజర్ అబ్దుల్లా అన్సారీ తెలిపారు.
మరోవైపు ఈ కమ్యూనిటీ వాషింగ్ సెంటర్లో తక్కువ ధరకే బట్టలు చక్కగా ఉతుకుతారని స్థానికుడు విశాల్ పాటిల్ తెలిపారు. తన దుస్తుల వాషింగ్ కోసం ప్రతి రెండు వారాలకు ఇక్కడకు వస్తానని చెప్పారు. పేదల కోసం ఇలాంటి సౌకర్యాలు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.