జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : అన్ని వర్గాల కార్మికులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని, హమాలీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మున్సిపల్ పరిధిలోఉన్న కాటన్ మిల్లుల్లోని హమాలీ కార్మికులకు కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం ప్రచారం చేశారు.
కార్మికులకు కరపత్రాలు అందించారు. వారితో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం ఆనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నదని తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నామని, కార్మికుల కష్టాలన్నీ సీఎం కేసీఆర్కు తెలుసని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల కార్మికులకు కరపత్రాలు అందించారు. వారితో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం ఆనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నదని తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నామని, కార్మికుల కష్టాలన్నీ సీఎం కేసీఆర్కు తెలుసని చెప్పారు. ఇండ్లులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించిన తర్వాత మొదటి ప్రాధాన్యత కింద కార్మికులకు అందిస్తామన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షపాతిగా ఉంటుందని, గెల్లు సీనును గెలిపించుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం జరుగు తుందని తెలి పారు. మంత్రి ఈటల పార్టీకి చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. కార్మికుల పొట్టగొట్టే బీజేపీ పార్టీలో చేరాడని, ఆయన గెలిస్తే ఇక్కడి ప్రజలు నష్టపోతారని స్పష్టం చేశారు. తర్వాత 500మంది కార్మికులంతా టీఆర్ఎస్ కే ఓటేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.
గెల్లు సీనును గెలిపించుకుని కార్మికుల సత్తా చూపిస్తామని ప్రతినబూనారు. ఇక్కడ మంత్రితో పాటు రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఒల్లాల శ్రీనివాస్, టీఆర్ఎస్ అర్బన్శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సీనియర్ నాయకుడు వాసాల రామస్వామి, కార్మికులు, తదితరులున్నారు.