మెదక్ : బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ పుస్తెలతాడును అపహరించుకు పోయిన సంఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మటం అనిత అనే మహిళ తన వ్యవసాయ పొలం పనులను ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నది. ఈ క్రమంలో వెనుక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వచ్చి దారి అడిగి నట్లుగా నటిస్తూ.. మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చేగుంట ఎస్ఐ సభాష్గౌడ్ తెలిపారు.