హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా కొకైన్ను పట్టుకున్నారు. రూ.11.57కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుంచి ఈ కొకైన్ను రికవరీ చేసుకున్నారు. సదరు వ్యక్తి ఈ నెల 21న శంషాబాద్కు రాగా.. కొకైన్ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.