హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నాగుపాము కలకలం సృష్టించింది. ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం ముందు ఆదివారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కనే నాగుపాము పడగవిప్పి చుట్టూ చూస్తూ కనిపించడంతో వాహనదారులు భయంతో ఆగిపోయారు. దాంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నాగుపాము ప్రత్యక్షమైందన్న ప్రచారం జరుగడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడారు. చివరికి అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించడంతో వారు వచ్చి పామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.