కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు రూ. 1లక్ష, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన కళమ్మకి రూ. 24వేలు, ఆమనగల్లు మండలానికి చెందిన వెంకటయ్యకి రూ. 40 వేలు, వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఈదన్నకి రూ. 2,50,000 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్సీ సహకరంతో మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలందరికీ కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నా రు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, సుమన్గౌడ్, మోత్యానాయక్ పాల్గొన్నారు.