సూర్యాపేట : అభాగ్యులకు అండగా..ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక దవాఖానల్లో చికిత్స పొందిన 275 మంది నిరుపేదలకు రూ.90 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని తెలిపారు.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.