కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన శంకర్ రూ. 30వేలు, వల్లికి రూ. 20వేలు, మాడ్గుల్ మండలానికి చెందిన శ్రీజారెడ్డికి రూ. 42 వేలు, బ్రాహ్మణపల్లికి చెందిన కిరణ్రెడ్డికి రూ. 60వేలు, మారెడ్డికి రూ. 60వేలు, వెల్దండ మండల పోతేపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్యకి రూ. 34వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకరంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి.
బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు చెక్కులను నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు కార్పారేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతు న్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లుగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, శ్రీకాంత్రెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.