ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్ను శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా, నవీ ముంబైలోని విమానాశ్రయానికి డీబీ పాటిల్గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తన చివరి కేబినెట్లో రెండు పట్టణాలు, విమానాశ్రయం పేర్లను మార్చిందన్నారు. ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని, గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం మరోసారి పేర్లను మార్చిందన్నారు. వాస్తవానికి రాజకీయ సంక్షోభం మధ్య అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన చివరి కేబినెట్ సమావేశంలో నగరాలు, విమానాశ్రయాల పేర్లను మార్చేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.