బడంగ్పేట : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మామిడిపల్లికి చెందిన కోట్ల బాబు, సీతారామ్రెడ్డి, ఈరంకి రాజ్కుమార్ గౌడ్లు ఇటీవల అనారోగ్యాలకు గురయ్యారు. వారు ప్రైవేట్ దవాఖానాలలో చికిత్స తీసుకున్నారు. అధిక ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి కుటుంబసభ్యులు స్థానిక 11వ డివిజన్ కార్పొరేటర్ సుక్క శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన సబితా ఇంద్రారెడ్డి దృఫ్టికి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. వచ్చిన చెక్కులను కోట్ల బాబుకు రూ. 25వేలు, సీతారామ్రెడ్డికి రూ. 60వేలు, ఈరంకి రాజ్కుమార్గౌడ్కు రూ. 30వేలకు సంబంధించిన చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు ఆమె నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ యాతం పవన్కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందుకూరు: ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆనేగౌని దామోదర్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు ఆనేగౌని పాండుగౌడ్లు తెలిపారు. మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన మణెమ్మకు సీఎం రీలీఫ్ ఫండ్ 60వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. అట్టి చెక్కును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆమె ఇంటికి వెళ్లి సోమవారం బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పేదలను అన్ని విదాలుగా ఆదుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రీలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.