వనపర్తి : పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా ఉన్న 182 మంది లబ్దిదారులకు రూ.61 లక్షల 38 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి శనివారం అందజేశారు. చెక్కులతో పాటు లబ్దిదారులకు కిలో తెలంగాణ సోన బియ్యం, కిలో తాండూరు కందిపప్పు, పండ్ల బుట్టలు అందజేశారు. సంక్షేమం, అభివృద్ది, సహాయం సీఎం కేసీఆర్ సర్కార్ విధానం అన్నారు.