వ్యవసాయ యూనివర్సిటీ : నిరుపేదల ప్రాణాలకు భరోసా నిచ్చే ఏకైక పథకం సీఎం రిలీఫ్ఫండ్ , రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం సులేమాన్ కాలనీకి చెందిన మహమూదాబేగం కుటుంబానికి ఆయన రూ. 33 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేశారు .డివిజన్ టీఆర్ఎస్ నాయకులు షేక్ నయిమోద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలన్నీ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేలా ఉంటాయన్నారు.
రెక్కాడితే తప్ప కుటుంబం గడవని పేదవారినుంచి ఉన్నతవర్గాల వారికి సైతం అనుకోని ఆపద వస్తే అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా నేరుగా ఆయా ఆసుపత్రులకు డబ్బులు చేరుతా యనే భరోసాతో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది మంచి వైద్యం పొంది ఆనందంగా జీవనం గడుపుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సయ్యద్ ఇస్సాఖోద్ధీన్ , షేక్ బాబా, ఎండీ స్సెన్ తదితరులు పాల్గొన్నారు.