యాదాద్రి భువనగిరి : తెలంగాణలో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంచాలన్నదే సీఎం కేసీఆర్ హరిత సంకల్పమని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారు. రాయగిరి సమీపంలోని ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్ ను మంత్రులు పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.
హరితహారం కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరిగిందన్నారు. పర్యావరణ సమతుల్యతతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు.
అడవుల పునర్జీవం, ప్రత్యామ్నాయ అడవుల పునరుద్ధరణ, హరితహారం కార్యక్రమాల వల్ల యాదాద్రి జిల్లాలో పచ్చదనం పెరిగిందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం పునఃప్రారంభం తర్వాత ఈ ప్రాంతం మరింత కళకళలాడుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ