హైదరాబాద్ : బేగంపేటలోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు – శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రగతి భవన్లో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్, సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయకుడిని ట్యాంక్బండ్ 10వ నెంబర్ క్రేన్ వద్ద గణేశుడిని నిమజ్జనం చేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, హిమాన్షు పాల్గొన్నారు.