హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ’ శు భాకాంక్షలు తెలిపారు. గోలొం డ జగదాంబికా అమ్మవారికి గురువారం బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్టు గుర్తుచేశారు.
తెలంగాణ సబ్బండవర్ణాల సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిధ్యానికి, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.