హైదరాబాద్ : ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లనున్నారు.
గత గురువారం ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.