హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగా ణ): మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి ద్వాదశదినకర్మ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరై నివాళి అర్పించారు. విజయలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వెంకటేశ్వర్లును ఓదార్చి, కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, టీఆర్ఎస్ నేత శ్రవణ్కుమార్రెడ్డి ఉన్నారు.