హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సందర్శనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి ఉదయం 11.30 గంటలకు రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకొని పూజల్లో పాల్గొంటారు. సీఎం కేసీఆర్ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు.
బాలాలయం ఆవరణలో ‘కళావేదిక’కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రోడ్డులోని ప్రతిమ దవాఖానకు 11.15 గంటలకు చేరుకొంటారు. అనంతరం ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు.