హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా, సమావేశంలో పీఆర్సీ, లాక్డౌన్, వైద్యం, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంటర్ పరీక్షలు, వ్యాక్సినేషన్, భూముల డిజిటల్ సర్వే, థర్డ్ వేవ్ సన్నద్ధత, ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభం, తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు సడలించే అవకాశం ఉంది.