సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దీంతోపాటు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదువేల మంది కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తున్నారని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
శుక్రవారం ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం జరిగే సమైక్యత వజ్రోత్సవ సభ, ర్యాలీలకు సంబంధించి ట్రాఫిక్ పరంగా తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడం, కళాకారుల ర్యాలీ ఉండటంతో ఈ రెండు భారీ కార్యక్రమాల నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలో ఉండే వారు ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని తమ కార్యక్రమాలకు ప్లాన్ చేసుకోవాలని కోరారు.
సివిల్ పరీక్షలు.. త్వరగా బయలుదేరండి..
శనివారం సివిల్ సర్వీసెస్కు సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మెయిన్స్ పరీక్ష కూడా ఉంది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని రంగనాథ్ సూచించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్ల నుంచి కాకుండా ప్రత్యామ్నయ మార్గాల మీదుగా వెళ్లాలని సూచించారు.
33 జిల్లాల నుంచి జనం..
శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంసృతిక కార్యక్రమాలు, సీఎం బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 2300 ప్రత్యేక బస్సుల్లో లక్ష మందికి పైగా హాజరుకానున్నారని అంచనా ఉన్నదని తెలిపారు. ఈ సభ ప్రారంభంకావడానికి ముందు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేదర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాలు, నగర నడిబొడ్డున, హుస్సేన్సాగర్ పరిసరాలలోనే ఉన్నాయి.
ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ 3 కి.మీ. పరిధిలో..
ఈ కార్యక్రమాల ప్రభావం ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ మూడు కి.మీ. పరిధిలోని ప్రాంతాలపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సెంట్రల్ జోన్లోని 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించినట్లు వివరించారు. ఆంక్షల సమయాల్లో నెక్లెస్రోడ్ను పూర్తిగా మూసి వేసి, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీలో పారింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల నుంచి వేదిక వరకు కాలినడకన రావాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను ఇతర రూట్లలో మళ్లిస్తున్నట్లు తెలిపారు.
కవాడిగూడ, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ఇక్బాల్ మీనార్, ట్యాంక్ బండ్, ఐమాక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
ఈ చౌరస్తాల నుంచి వెళ్లొద్దు..
అంబేదర్ విగ్రహం, కవాడిగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, నెక్లెస్ రోడ్, అశోక్ నగర్, ఇందిరాపార్ చౌరస్తాల వైపు వెళ్లవద్దు.
ఈ జంక్షన్ల నుంచి వెళ్లకపోవడం మంచిది..
రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, బషీర్బాగ్, రాణిగంజ్, బైబిల్హౌస్, కర్బలా మైదాన్, ఖైరతాబాద్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్నగర్, హైదర్గూడ, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీ.. జంక్షన్ నుంచి వెళ్లకపోవడం మంచిదని తెలిపారు.