హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విజయ దశమి పర్వదినం సం దర్భంగా ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్లపోచమ్మ ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. అనంతరం జమ్మి వృక్షా న్ని వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్దంగా పూజించారు. పవిత్ర జమ్మి ఆకులను అకడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు అం దించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతిభవన్లో ఆయుధపూజ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, సీఎంవో అధికారులు, ప్రగతిభవన్ సిబ్బంది పాల్గొన్నారు.