కేంద్రం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ఎవ్వరికీ పనికిరాని బడ్జెట్ అన్నారు. బీజేపీకి అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎదురుగాలి వీస్తోందని.. గతంలో ఉన్నటువంటి ఆదరణ.. బీజేపీకి ఇప్పుడు లేదని.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఆదరణ మరింత తగ్గుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్వత లేని వాళ్లు.. రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేనివాళ్లు.. రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికలు 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్ అని చెబుతున్నారు కానీ.. అది తలా తోక లేని ప్రచారం. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో బీజేపీ స్థాయి మాత్రం తగ్గుతుంది. టీఆర్ఎస్ పార్టీకి 2014లో 63 సీట్లు వచ్చాయి. 2018లో 88 స్థానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో నేను గ్యారెంటీగా చెప్పగలను. బీజేపీ స్థానాలు మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. గతంలో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తగ్గుతున్నది. అది 24లో బీజేపీ పతనానికి పునాది.. గ్యారెంటీ. అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు.
దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ మార్పు కోసం.. కేసీఆర్గా.. ఈ దేశ బిడ్డగా ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏరూపంలో ఉంటది.. ఎలా ఉంటుంది అనేది కొద్దిరోజుల్లోనే తెలుస్తుంది. చాలామందితో మాట్లాడా. దేశంలో రావాల్సిన ప్రబల పరివర్తన కోసం దేశంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈరోజు బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సామాన్య ప్రజల వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్గా నేను అభివర్ణిస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.